Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రా అమ్మాయి.. అదరగొట్టిందోచ్.. పతకం ఖాయం!

ఆంధ్రా అమ్మాయి.. అదరగొట్టిందోచ్.. పతకం ఖాయం!
, శనివారం, 30 ఆగస్టు 2014 (16:03 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధు సత్తా చాటింది. హోరా హోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో సింధు విజయం ఖాయం చేసుకుంది. తద్వారా సెమీస్‌కు చేరి పతకం ఖాయం చేసింది. 
 
క్వార్టర్‌ ఫైనల్‌లో రెండో సీడ్‌ షిజియాన్‌ వాంగ్‌పై సింధు విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచే సింధు చెలరేగి ఆడారు. మొదటి గేమ్‌ కోల్పోయినా ఆ తర్వాత పుంజుకుంది. వరుసగా రెండు గేమ్స్‌లు గెలిచి మ్యాచ్‌ను ముగించింది. 
 
గత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు మెడల్స్‌ సాధించిన క్రీడాకారిణిగా సింధు రికార్డు నెలకొల్పింది. 

Share this Story:

Follow Webdunia telugu