Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెజ్లింగ్‌లో అదరగొడుతున్న మనోళ్లు : పతకాల పంట!

రెజ్లింగ్‌లో అదరగొడుతున్న మనోళ్లు : పతకాల పంట!
, గురువారం, 31 జులై 2014 (13:54 IST)
గ్లాస్గోలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్లు తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు. బుధవారం రెజ్లింగ్‌లో భారత్ మరో 4 రజత పతకాలను సొంతం చేసుకుంది. 
 
మహిళల 53 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో లలిత, పురుషుల 61 కిలోల విభాగంలో భజరంగ్, మహిళల 58 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో సాక్షి మాలిక్, పురుషుల 97 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో కడియన్ రజత పతకాలు కైవసం చేసుకున్నారు.
 
ఫైనల్లో నైజీరియా రెజ్లర్ అడెక్వొరొయె చేతిలో లలిత, కెనడా రెజ్లర్ ట్రెంబ్లే చేతిలో భజరంగ్, నైజీరియా రెజ్లర్ అడెనియి చేతిలో సాక్షి, కెనడా రెజ్లర్ గిల్ చేతిలో కడియన్ పరాజయం పాలైయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu