Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెమీస్‌లో సాయిప్రణీత్ ఓటమి

సెమీస్‌లో సాయిప్రణీత్ ఓటమి
డచ్ జూనియర్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ బాలుర సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు బి. సాయిప్రణీత్ సెమీఫైనల్లో ఇంటిదారిపట్టాడు.

నెదర్లాండ్స్‌లోని హార్లెమ్ పట్టణంలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో సాయి ప్రణీత్ 13-21, 7-21 స్కోరు తేడాతో.. మలేషియాకు చెందిన రెండో సీడ్ ఇస్కందర్ జుల్కర్‌నైన్ చేతిలో ఓటమి చవిచూశాడు.

అంతకుమునుపు జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రణీత్ 14-21, 21-18, 21-3 స్కోరు తేడాతో... స్లొవేకియాకు చెందిన నాలుగో సీడ్ మెతేవ్ బాజుక్‌పై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, బాలుర డబుల్స్ విభాగంలో సాయి ప్రణీత్-ప్రణవ్ చోప్రా జోడీ క్వార్టర్ ఫైనల్స్‌లో అపజయం పాలయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu