భారత పరుగుల యంత్రం సచిన్ టెండూల్కర్కు భారత రత్న ఇవ్వాలని గొంతు కలిపే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. ఈ జాబితాలో తాజాగా భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్రాజ్ పిళ్లై కూడా చేశారు. తన మాస్టర్మైండ్తో ప్రపంచ కప్ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన సచిన్కు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వాలని కోరారు.
గత 22 సంవత్సరాలుగా క్రికెట్ క్రీడకు అంకితమైన సచిన్ భారతరత్న పురస్కారానికి అన్ని రకాల అర్హులన్నారు. భారత జట్టు సాధించిన ప్రపంచ కప్ విజయం వెనుక సచిన్ మాస్టర్ మైండ్ దాగివుందన్నారు.
అలాగే, కేంద్ర మంత్రి సుషీల్ కుమార్ షిండే మాట్లాడుతూ భారత రత్నతో టెండూల్కర్ను సత్కరించాలన్నారు. సర్ డోనాల్డ్ బ్రాడ్మెన్ తరహాలో తన బ్యాటింగ్ విన్యాసాలతో క్రికెట్ ప్రపంచంలోని అభిమానులందరినీ సంతోషపెట్టారన్నారు. ఇప్పటికే అన్ని రకాల రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించిన విషయం తెల్సిందే.