Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రేపటి నుంచి ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ప్రారంభం

రేపటి నుంచి ఆల్ ఇంగ్లండ్ టోర్నీ ప్రారంభం
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నీ తొలి రౌండ్‌లో చిరకాల ప్రత్యర్థి ఫ్రాన్స్‌కు చెందిన హోంగ్యాన్‌పితో భారత స్టార్ సైనా నెహ్వాల్ తలపడుతుంది. గాయం కారణంగా గత మూడు వారాల పాటు ఆటకు దూరంగా ఉన్న ప్రపంచ టాప్ టెన్ క్రీడాకారిణి సైనా ఈ టోర్నీకి పెద్దగా ప్రాక్టీస్‌ లేకుండానే బరిలోకి దిగుతున్నారు.

కాగా, గతంలో హోంగ్యాన్‌పితో గతంలో తలపడిన సైనా.. ఆమెను ఖంగుతినిపించారు. ఈ నమ్మకంతోనే ప్రాక్టీస్‌ లేకుండానే బరిలోకి దిగుతున్నారు. తొలి పోటీలోనే హ్యోంగాన్‌తో తలపడాల్సి రావడం కొంత ఇబ్బందికరమేనని, అయితే విజయం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పింది.

గాయం వల్ల కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉన్నా... సైనా ఆల్‌ ఇంగ్లాండ్‌ టోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉందని భారత కోచ్‌ గోపీచంద్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆమె ఆత్మవిశ్వాసం పెరగడం ఖాయమన్నాడు. పురుషుల విభాగంలో 13వ సీడ్‌ చేతన్‌ ఆనంద్‌ తొలిరౌండ్‌లో ఆండ్రూ స్మిత్‌ (ఇంగ్లాండ్‌)తో తలపడుతాడు.

Share this Story:

Follow Webdunia telugu