Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మలేషియా ఫ్యూచర్స్: సెమీస్‌లోకి విష్ణువర్ధన్

మలేషియా ఫ్యూచర్స్: సెమీస్‌లోకి విష్ణువర్ధన్
మలేషియా ఫ్యూచర్స్-5 టోర్నమెంట్లో హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారుడు విష్ణువర్ధన్‌ మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్నాడు. ఈ టోర్నీ సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో ఓడిన విష్ణు.. డబుల్స్‌లో దివిజ్ శరణ్‌తో కలిసి సెమీఫైనల్లోకి అడుగుపెట్టాడు.

బుధవారం జరిగిన సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్ విష్ణు 6-7, (3/7), 3-6తో ఆంట్ పావిక్ (క్రొయేషియా) చేతిలో ఓటమిని చవిచూశాడు. అయితే డబుల్స్ విభాగంలో విష్ణు-దివిజ్ శరణ్ ద్వయం 7-5, 4-6, 10-6 తేడాతో డోక్‌మైక్‌లీ - వాచిరామమనోవోంగ్ (థాయ్‌లాండ్)పై నెగ్గింది. సెమీస్‌లోనూ విష్ణువర్ధన్ జోడీ ప్రత్యర్థి జట్టును మట్టికరిపించే దిశగా పోటీ చేస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu