జాతీయ మహిళల చెస్ ఛాంపియన్షిప్లో ఏడో రౌండ్ను ద్రోణవల్లి హారిక డ్రాగా ముగించింది. ఏడో రౌండ్ను డ్రాగా ముగించడంతో హారిక ఈ టోర్నీ రెండో స్థానంలో కొనసాగుతోంది.
మంగళవారం ఏడో రౌండ్లో ఇషా కర్వాడేతో జరిగిన మ్యాచ్ను హారిక (5.5) డ్రాగా ముగించింది. ఎయిరిండియాకు చెందిన మీనాక్షి సుబ్రమణియన్ ఏడు మ్యాచ్ల్లో ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే కిరణ్ మనీషా (ఒరిస్సా)తో జరిగిన మ్యాచ్ను మీనాక్షి డ్రాగా ముగించింది. ఇకపోతే.. ఈ టోర్నీలో కిరణ్ మూడో స్థానంలో కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. ప్రీమియర్ చెస్లో ఆంధ్రప్రదేశ్ చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక ఆరో రౌండ్ గేమ్లో విజయం సాధించింది. టాప్ సీడ్ అయిన హారిక ఆరో రౌండ్ గేమ్లో హారిక మహిళా గ్రాండ్ మాస్టర్ మేరి గోమ్స్ (పశ్చిమ బెంగాల్)ను చిత్తుగా ఓడించింది.