జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్: ప్రి క్వార్టర్స్లో చేతన్
గౌహతిలో జరుగుతున్న జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. పీఎస్పీబీకి చెందిన చేతన్ ఆనంద్, రైజింగ్ స్టార్ గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్, క్వాలిఫయర్ తనిష్క్ తమ తమ ప్రత్యర్థులపై నెగ్గి ప్రి క్వార్టర్స్లోకి ప్రవేశించారు.పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో చేతన్ ఆనంద్ 21-18, 21-14 స్కోరుతో చండీగడ్కు చెందిన తుషార్ బడేచాపై విజయం సాధించాడు. అలాగే గురుసాయిదత్ 21-10, 21-6 స్కోరుతో బీహార్కు చెందిన సందీప్ కుమార్పై, 21-6, 21-12 స్కోరుతో రైల్వేస్కు చెందిన కిరణ్ కుమార్ను కశ్యప్ ఓడించాడు. ఇంకా 21-19, 21-16 స్కోరుతో పీఎస్పీబీకి చెందిన విద్యాధర్పై నెగ్గాడు.ఇదిలా ఉంటే.. సుమీత్, పి.వి.సింధులకు మూడో రౌండ్లో చుక్కెదురైంది. సింధు 21-17, 15-21 స్కోరుతో తృప్తి ముర్గుండే చేతిలో.. సుమీత్ 10-21, 13-21 స్కోరుతో టాప్ సీడ్ అజయ్ జైరామ్ చేతిలో ఖంగుతిన్నారు. ఇక ఏపీకి చెందిన సాయిప్రణీత్ రెండో రౌండ్లో వెనుదిరగగా, మహిళల విభాగంలో సిక్కిరెడ్డి 21-11, 21-18 స్కోరుతో చిత్రలేఖపై విజయం సాధించి ప్రి క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది.