Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కామన్వెల్త్: మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లోకి సానియా మీర్జా!

కామన్వెల్త్: మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లోకి సానియా మీర్జా!
FILE
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడా పోటీల్లో భాగంగా మహిళల టెన్నిస్ సింగిల్స్ క్వార్టర్ ఫైన్లలోకి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా దూసుకెళ్లింది. కుక్ ఐలాండ్స్‌కు చెందిన బ్రిట్టని టీయ్‌తో బరిలోకి దిగిన సానియా మీర్జా ప్రత్యర్థిపై గట్టిపోటీని ప్రదర్శించి, క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఆద్యంతం మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన సానియా మీర్జా 6-0, 6-2 తేడాతో బ్రిట్టనీని మట్టికరిపించింది.

కాగా, మంగళవారం పురుషుల సింగిల్స్‌లో భారత యువ ఆటగాడు సోమదేవ్ దేవ్‌వర్మన్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించిందన సంగతి తెలిసిందే. శ్రీలంకకు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారుడు అమ్రేష్‌ను సోమదేవ్ 6-0 6-1 తేడాతో ఓడించాడు. ఫలితంగా క్వార్టర్ ఫైనల్లో స్కాట్లాండ్‌కు చెందిన కొలిన్ ఫ్లెమింగ్ లేదా రుబిన్ స్టాథం (కివీస్)తో సోమదేవ్ బరిలోకి దిగే అవకాశం ఉంది.

Share this Story:

Follow Webdunia telugu