Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసియన్ టీటీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన చైనా!

ఆసియన్ టీటీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన చైనా!
ఆసియన్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో చైనా క్రీడాకారుల హవా కొనసాగుతోంది. చైనాకు చెందిన పురుషులు, మహిళల జట్లు ఆసియన్ టీటీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి.

ఇందులో భాగంగా చైనా పురుషుల జట్టు భారత్‌ను 3-1 తేడాతో ఓడించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అలాగే చైనా మహిళల జట్టు థాయ్‌లాండ్‌పై 3-0 తేడాతో నెగ్గింది.

చైనాతో పాటు హాంగ్‌కాంగ్, సింగపూర్, కొరియాలు కూడా ఆసియన్ టేబుల్ టెన్నిస్ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్ జట్టు కొరియాపై 3-1 తేడాతో ఓడించగా, జపాన్ కొరియాపై 3-1, చైనీస్ తైపీ సింగపూర్‌ను మట్టికరిపించాయి.

అలాగే మహిళల విభాగంలో కొరియాపై 3-0తో నెగ్గిన సింగపూర్, జపాన్‌ను 3-1 తేడాతో ఓడించిన కొరియా జట్లు సైమీఫైనల్లోకి చేరుకున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu