Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం నుంచి సబ్ జూనియర్ నేషనల్ బాక్సింగ్!

ఆదివారం నుంచి సబ్ జూనియర్ నేషనల్ బాక్సింగ్!
ఒలింపిక్ పోటీలకు సన్నాహకంగా రెండో జూనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం (జూలై 14) నుంచి ప్రారంభం కానున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జేసీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రౌండ్స్‌లో ఈ టోర్నీ జరుగుతుందని తమిళనాడు బాక్సింగ్ అసోసియేషన్ (టీఎన్‌బీఏ) కోశాధికారి గోవిందరాజ్ అన్నారు.

బాలికల కోసం నిర్వహించే ఈ టోర్నీలో వయోపరంగా మ్యాచ్‌లు జరుగుతాయి. 11, 12, 13 ప్లస్‌ల్లో వివిధ కేటగిరీల్లో పోటీలుంటాయని గోవిందరాజన్ వెల్లడించారు. అన్ని జిల్లాలకు చెందిన క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొంటారు. ఒక జిల్లాకు పది బాక్సర్ల చొప్పున 360 మంది బాక్సర్లు ఈ టోర్నీ బరిలోకి దిగుతారు.

Share this Story:

Follow Webdunia telugu