Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిశ్రమ ఫలితాల్లో కొనసాగుతోన్న విదేశీ మార్కెట్లు

మిశ్రమ ఫలితాల్లో కొనసాగుతోన్న విదేశీ మార్కెట్లు
గురువారం విదేశీ ఆసియా, యూరప్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.00 గంటలకు యూరప్ ఆసియా మార్కెట్లు లాభ, నష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.

అయితే దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మాత్రం గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 64 పాయింట్ల లాభంతో 17,189 పాయింట్ల మార్కు వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 22 పాయింట్లు బలపడి, 5,134 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని ముగించింది.

ఇకపోతే.. యూరప్ మార్కెట్లు కూడా గురువారం మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాల్లో కొనసాగిన యూరప్ స్టాక్ మార్కెట్ సూచీలు తర్వాత పుంజుకున్నాయి. దీంతో ఎఫ్‌టీఎస్ఈ 100 సూచీ 19 పాయింట్లు పుంజుకుని, 5,223 పాయింట్ల వద్ద కొనసాగుతోండగా, డాక్స్ కూడా 31 పాయింట్లు వృద్ధి చెంది, 5,679 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.

అయితే ఆసియా మార్కెట్లు గురువారం నష్టాల్లో కూరుకుపోయాయి. ఇందులో భాగంగా నికాయ్ 225 సూచీ.. 141 పాయింట్ల నష్టంతో 9,862 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే హాంగ్ షెంగ్ 41 పాయింట్లు పతనమై, 21,700 పాయింట్ల వద్ద పయనిస్తోంది.

ఇకపోతే.. అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలతో ముగిశాయి. డౌ సూచీ మాత్రం 51 పాయింట్లు బలపడి, 10,337 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని ముగించింది.

Share this Story:

Follow Webdunia telugu