Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతి దాన మహిమను తెలిపే కథేంటో తెలుసా?

సంక్రాంతి నాడు విష్ణుసహస్రనామ పఠనం విశేష ఫలితాలనిస్తుందట!

సంక్రాంతి దాన మహిమను తెలిపే కథేంటో తెలుసా?
FILE
సంక్రాంతి నాడు విష్ణు సహస్ర నామ పఠనం విశేష ఫలితాలను ఇస్తుందని పురోహితులు చెబుతున్నారు. ఈ రోజు సూర్య భగవానుడు మకరరాశిలోకి ప్రవేశించే పుణ్య ఘడియ, ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం. ఈ రోజున స్నాన, దాన, జప, వ్రతాదులు విశేషఫలితాలనిస్తాయి.

నువ్వు, బెల్లం, గుమ్మడికాయలు వంటి వాటిని దానం చేయడంతో పాటు పితృదేవతలకు తర్పణాలను వదిలితే మంచిది. ఈ రోజున దానాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఆ దాన మహిమను తెలిపే కథేంటో తెలుసా?

ద్రోణాచార్యుని భార్య కృపి. ఒక రోజు ద్రోణాచార్యుడు బయటకు వెళ్ళగా, ఆశ్రమంలో కృప్తి ఒక్కర్తే కూర్చుని వుందియ ఆ సమయంలో సమిధల కోసం వెదుక్కుంటూ వచ్చిన దుర్వాస మహాముని ద్రోణుని ఆశ్రమానికి వచ్చాడు. ఆ మునిని తమ ఆశ్రమంలోకి స్వాగతించిన కృపి, తమ పేదరికాన్ని ఒప్పుకుని , తమకు ఈ ప్రపంచంలో ఒక ముసలి ఆవు తప్ప ఏమీ లేదని, పిల్లలు కూడా కలుగలేదని వేడుకుంది.

ఆమె మాటలు విని దయార్ద్ర హృదయుడైన దుర్వాసుడు సంక్రాంతినాడు, గంగానదిలో స్నానం చేసి, ఓ బ్రహ్మణుని పెరుగును దానం చేస్తే ఫలితం ఉంటుందని, ఆ రోజే సంక్రాంతి కనుక వెంటనే ఆవ్రతాన్ని చేయమని సలహా ఇచ్చాడు. ఆయన మాటల ప్రకారం కృపి దగ్గర్లో ఉన్న నదిలో స్నానం చేసి, దుర్వాసునికే పెరుగును దానం చేసింది. ఫలితంగా ఆమెకు ఓ చక్కని కొడుకు కలిగాడు. అతడే అశ్వత్థామ. అశ్వత్థామ పుట్టినప్పటి నుంచి కృపికి ఎటువంటి కష్టాలు ఎదురుకాలేదు.

Share this Story:

Follow Webdunia telugu