Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వర్ణ రథ సేవలో మహిళలు... పసుపుకుంకుమల తల్లి

స్వర్ణ రథ సేవలో మహిళలు... పసుపుకుంకుమల తల్లి
, సోమవారం, 24 నవంబరు 2014 (20:05 IST)
మహిళల పసుపుకుంకాలకు ప్రతీకగా నిలిచే స్వర్ణరథాన్ని వేలాదిమంది మహిళలు తిరుచానూరులో లాగారు. 15 అడుగుల ఎత్తున్న స్వర్ణ రథంలో అమ్మవారు కొలువుదీరి ఉండగా ఆ వేడుకను చూడడానికి వచ్చిన మహిళలు రథాన్ని లాగి తమ పసుపుకుంకాలకు రక్షణగా నిలవాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సంఘటన తిరుచానూరు బ్రహ్మోత్సవాలలో సోమవారం సాయంత్రం జరిగింది. కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం స్వర్ణరథంపై అమ్మవారు ఊరేగారు. 
 
స్వర్ణ కాంతులతో వెలుగులు విరజిమ్ముతన్న రథంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. వేలాది మంది మహిళా భక్తులు తిరుమాడ వీధులకు చేరుకున్నారు. అక్కడకు చేరుకున్న భక్తులు అమ్మవారి బంగారు రథాన్ని లాగి తమ భక్తిని చాటుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu