Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Swarna Rathotsavam: వైభవంగా తిరుమలలో స్వర్ణ రథోత్సవం

Advertiesment
Tirumala

సెల్వి

, మంగళవారం, 30 డిశెంబరు 2025 (16:08 IST)
వైకుంఠ ఏకాదశి వేడుకల్లో భాగంగా సోమవారం తిరుమలలో స్వర్ణ రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామిని బంగారు రథంపై అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకెళ్లారు, మార్గమధ్యంలో భక్తులను ఆశీర్వదించారు. 
 
ఇదిలా ఉండగా, పవిత్రమైన ఉత్తర ద్వార (వైకుంఠ ద్వార) దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో కొండపై రద్దీ విపరీతంగా పెరిగింది. 
 
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు భక్తుల రద్దీని నియంత్రించడానికి, వారికి సులభంగా దర్శనం కల్పించడానికి విస్తృత ఏర్పాట్లు చేశారు.
 
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు శుభ ముహూర్తంలో అర్ధరాత్రి దాటాక ప్రారంభమయ్యాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ధనుర్మాస కైంకర్యాలు, ప్రత్యేక హారతులు, నివేదనలు అనంతరం ఆలయ జీయంగార్లు, అర్చకులు, టీటీడీ అధికారులు వైకుంఠ ద్వార ప్రదక్షిణం చేశారని చెప్పారు. 
 
అనుకున్న దానికన్నా ముందుగానే దర్శనాలు ప్రారంభించామని.. ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకుంఠ ఏకాదశి విశిష్ఠత: తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్న ఆలయాలు (video)