Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి లడ్డూ ప్రసాదం సైజు తగ్గుతోందట.. 175 నుంచి 100 గ్రాములకు.. రూ.20

శ్రీవారి లడ్డూ ప్రసాదం సైజు తగ్గుతోందట.. 175 నుంచి 100 గ్రాములకు.. రూ.20
, మంగళవారం, 25 ఆగస్టు 2015 (13:23 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దేవస్థానంలో లడ్డూ సైజ్ తగ్గుతోందట. శ్రీవారి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో.. మరింత మందికి లడ్డూ ప్రసాదాన్ని అందించాలనే లక్ష్యంతో తితిదే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 175 గ్రాముల బరువున్న లడ్డూల స్థానంలో 100 గ్రాముల బరువుండే లడ్డూలను తయారు చేయించాలనే అంశంపై పరిశీలన జరుగుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. 
 
ఇంకా టీటీడీ ఛైర్మన్ మీడియాతో ట్లాడుతూ.. ప్రస్తుతం 175 గ్రాముల బరువుతో కూడిన శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని రూ.25కి విక్రయిస్తున్నామని తెలిపారు. ఇకపై తయారు చేయనున్న 100 గ్రాముల లడ్డూలను రూ. 15కు విక్రయించాలని భావిస్తున్నట్లు చదలవాడ చెప్పారు. పరిమాణాన్ని తగ్గించి, నాణ్యత పెంచి దాన్నే రూ.20కి విక్రయించినా... కొనుగోళ్లు ఏమాత్రం తగ్గవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu