Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తొలి కార్తీక సోమవారం... భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు

తొలి కార్తీక సోమవారం... భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు
, సోమవారం, 27 అక్టోబరు 2014 (10:13 IST)
ఈ ఏడాది తొలి కార్తీక సోమవారం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక సోమవారం కావడంతో ఇరు తెలుగు రాష్ట్రాలలో ఉన్న నదుల్లో అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాలయాలు, పంచారామ క్షేత్రాలు, ద్రాక్షారామం, సామర్లకోటలలో స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 
 
అదేవిధంగా శ్రీకాళహస్తి ఆలయం స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో శివాలయాలయాలకు భక్తులుపోటెత్తారు. భీమవరం పంచారామ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. కర్నూలు జిల్లా శ్రీశైలం దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలి వచ్చారు. కరీంనగర్ జిల్లా వేములవాడ భక్తులతో కిటకిటలాడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu