ఆర్జిత సేవ అడ్వాన్సు బుకింగ్కు తిరుమల తిరుపతి దేవస్థానం తిలోదకాలిచ్చింది. తిరుమలకు వచ్చి అడ్వాన్సు బుకింగ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందవచ్చుననుకునే వారు ఆ.. ఆలోచనలు మానుకోవాలి. డిసెంబర్ 1 నుంచి ఈ విధానానికి స్వస్తి పలుకుతున్నారు. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను పొందాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే ఇంతకుముందు తిరుమలలో సాధారణ భక్తులు అడ్వాన్సు బుకింగ్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను పొందవచ్చు.
అయితే టీటీడీ అధికారులు పాదర్శకత పేరుతో సాధారణ భక్తులకు ఉన్న ఆర్జిత సేవా టికెట్లను దక్కించుకునే అవకాశాన్ని కూడా దెబ్బతీసింది. డిసెంబర్ 1 నుంచి కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే భక్తులు ఈ టికెట్లను పొందాల్సి ఉంటుంది. చివరకు డిడిల ద్వారా టికెట్లను కూడా పొందే అవకాశం లేదు. వాటిని కూడా రద్దు చేశారు.