తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి నామం ఏర్పాటు విషయంలో తన కుమారుడు రాజేష్ దీక్షితులు తప్పు లేదని ఆలయ ప్రధాన అర్చకుడు ఏవీ రమణ దీక్షితులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో సాంబశివరావును కలిసి వివరణ ఇచ్చారు.
గత శుక్రవారం మూలవర్లకు అభిషేకం నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన తెల్లటి నామం అసంపూర్ణంగా ఉందని రాజేష్ దీక్షితులపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విమర్శల కారణంగా ఆయనను అభిషేక కైంకర్యాలకు దూరంగా ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవోను కలిసి వివరణ ఇచ్చారు. శ్రీవారికి నామం ఏర్పాటులో తన కుమారుడి తప్పిదం ఏమాత్రం లేదని, గిట్టనివారే ఈ పని చేసివుంటారన్నారు.