Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి భక్తుల కోసం అందుబాటులోకి 32,759 టిక్కెట్లు: ఈవో

శ్రీవారి భక్తుల కోసం అందుబాటులోకి 32,759 టిక్కెట్లు: ఈవో
, బుధవారం, 2 సెప్టెంబరు 2015 (10:53 IST)
శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్లను భక్తులకు పారదర్శకంగా కేటాయించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా, ముందస్తుగానే సేవల వారీగా మొత్తం టిక్కెట్ల సంఖ్యను, విడుదల సమయాన్ని ప్రకటిస్తున్నామని టీటీడీ తెలిపింది. ఈ టిక్కెట్లన్నీ 4న విడుదల చేస్తున్నామని టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. తిరుమల శ్రీనివాసునికి ఆర్జిత సేవలను చేయించాలని భావిస్తూ, టికెట్లు లభించడం లేదని బాధపడేవారికి ఇది శుభవార్తని టీటీడీ ఈవో చెప్పుకొచ్చారు. 
 
అక్టోబరు 3 నుంచి నవంబరు 15 మధ్య, భక్తుల కోసం 32,759 టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చినట్టు ఈవో వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి ఇవి అందుబాటులో ఉంటాయని ఈవో తెలిపారు. అభిషేకం నుంచి, తోమాల సేవ, అర్చన, కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణసేవ తదితరాల టికెట్లను విడుదల చేయనున్నట్టు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu