Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వారణాసి గంగ, యమున నదుల్లో దేవతామూర్తుల నిమజ్జనానికి బ్రేక్!

వారణాసి గంగ, యమున నదుల్లో దేవతామూర్తుల నిమజ్జనానికి బ్రేక్!
, మంగళవారం, 18 ఆగస్టు 2015 (18:51 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని గంగా నదిలో దేవతా మూర్తుల విగ్రహాల నిమజ్జనం నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. అంతేగాకుండా గంగ, యమున నదుల్లో విగ్రహ నిమజ్జనం చేయవద్దంటూ ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని అధికారులు ప్రజలకు తెలియజేశారు. 
 
నదుల కాలుష్యాన్ని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. త్వరలో రానున్న గణేష్, దుర్గామాత ఉత్సవాల నేపథ్యంలో అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. అయితే అధికారులు సూచించిన నీటి కొలనులు, ఇతర చోట్ల మాత్రమే విగ్రహాల నిమజ్జనం నిర్వహించాలని పట్టణ వాసులకు సూచించారు.
 
కాగా, గణేష్, దుర్గామాత ఉత్సవాలు ఘనంగా నిర్వహించే వారణాసిలో వేడుకల అనంతరం గంగానదిలో విగ్రహాలను నిమజ్జనం చేస్తుంటారు. విగ్రహాల్లో వాడుతున్న రసాయనాల కారణంగా గంగానది కలుషితమవుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరించడంతో కోర్టు నిమజ్జనంపై నిషేధం విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu