Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమల కొండపై వెలసిన వినాయకుడు

తిరుమల కొండపై వెలసిన వినాయకుడు
శ్రీ వేంకటేశ్వరుని సన్నిధానమైన తిరుమల కొండపై సహజసిద్ధంగా ఆదిపూజ్యుడైన వినాయకస్వామి వెలిశాడు. వెంకన్న ఆలయంలో పుష్కరిణికి ఆనుకుని ఉన్న రావిచెట్టులో విఘ్నేశ్వరుడు వెలిశాడు.

ఈ అద్భుతాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తకోటి తిరుమలకు తరలి వస్తున్నారు. మరోవైపు రావిచెట్టులో వెలిసిన వినాయకునికి భక్తులు ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు.

ఈ అద్భుతం విస్తృతంగా ప్రచారం కావడంతో తిరుమలకు వెళ్లిన భక్తులు కూడా విధిగా వినాయకస్వామికి దర్శించుకుని దీప దూప నైవేద్యాలు సమర్పించుకుంటున్నారు. దీనితో పెద్దగా భక్తుల సంచారం ఉండని పుష్కరిణి ప్రస్తుతం భక్తజన సంద్రంతో నిండిపోయింది.

Share this Story:

Follow Webdunia telugu