Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో ధార్మికోపన్యాసం

తిరుమలలో ధార్మికోపన్యాసం
జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సప్తహ ప్రవచన కార్యక్రమంలో భాగంగా ఆదివారం గోవిందరాజ స్వామి పుష్కరిణి వద్ద విష్ణు కథలపై ధార్మికోపన్యాసం చేశారు. విష్ణు కథల గురించి వేదాల్లో పేర్కొన్న పలు స్లోకాలను, పోతన రాసిన పద్యాలను వినిపించి వాటి అర్థాలను వివరించారు.

వేదాలు, కావ్యాల్లో పేర్కొన్న విష్ణుతత్వాన్ని బోధించారు. శ్రీ వేంకటేశ్వరునిది దశావతారాల్లో మూడో అవతారంగా వేదాలు చెబుతున్నాయని సామవేదం షణ్ముఖ శర్మ ప్రవచనంలో పేర్కొన్నారు.

టీటీడీ ఈవో రమణాచారి చేతుల మీదుగా ప్రారంభమైన సప్తహా ప్రవచనంలో భాగంగా.. ఈ నెల 13వ తేదీ వరకు షణ్ముఖ శర్మ ప్రవచనం కొనసాగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu