Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీరామనవమి రోజున వ్రతమాచరిస్తే.. మహాపాపాలు తొలగిపోతాయట!

శ్రీరామనవమి రోజున వ్రతమాచరిస్తే.. మహాపాపాలు తొలగిపోతాయట!
, గురువారం, 14 ఏప్రియల్ 2016 (12:02 IST)
శ్రీరామనవమి రోజున వ్రతం ఆచరిస్తే మహాపాపాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా జన్మజన్మాల పాపాలు జ్ఞానాగ్ని వల్ల నాశనమవుతాయని వారు చెప్తున్నారు. వ్రతం ఎలా ఆచరించాలంటే..? శివభక్తుడైన అగస్త్యమహర్షి సుతేష్ణ మహర్షితో ఇలా చెప్పాడు 'ఓ సుతేష్ణ మునీ! నీకు నేను ఒక రహస్యము చెపుతాను' అని ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు.
 
చైత్రమాసంలో శుక్లపక్షమి రోజున సచ్చిదానంద స్వరూపియైన రామచంద్రుడు అవతరించెను. కాబట్టి ఆ రోజున ఉపవాసం ఉండి ఆ రాత్రి శ్రీరాముని షోడశోపచారాలతో ఆరాధించి పురాణానాన్ని చదివి, జాగారణ చేసి మరుసటి రోజు ఉదయాన్నే శుచిగా స్నానమాచరించి తన శక్తికి తగినట్లుగా, భక్తియుక్తులతో శ్రీ తన శక్తికి తగినట్లుగా భక్తియుక్తులతో శ్రీరామచంద్రుని పూజించి.. అన్నదానం చేసి.. గోవు, భూమి, నువ్వులు, బంగారం, వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి కౌసల్య పుత్రుడైన శ్రీరామచంద్రుని ఆనందింపచేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెప్తున్నారు. ఇలా శ్రీరామనవమి వ్రతం భక్తిగా ఆచరించు వారి జన్మాంతరముల పాపాలు అన్నీ నశించిపోతాయి. ఇంకా సర్వోత్తమమైన విష్ణు పదము లభిస్తుంది. ఈ ధర్మం అందరికీ ఇహపరలోకాలలో భోగాన్ని మోక్షాన్ని కలిగిస్తుంది. 
 
అంతేగాకుండా నవమి రోజున శ్రీరామ ప్రతిమకు పూజను పూజావిధానంగా చేసినట్లయితే ముక్తులవుతారు. శ్రీరాముడి ప్రతిమను తమ శక్తికి తగ్గట్టు.. రజత, స్వర్ణంతో చేయించి పై వ్రతం చేసినట్లయితే ఆ వ్యక్తి సర్వపాపాలు తొలగిపోతాయి. రామమంత్రం తెలియనివాడు ఈ వ్రతం రోజున ఉపవాసం ఉండి, శ్రీరామ స్మరణ చేసినట్లయితే అన్ని పాపాలు నశించినవాడు అవుతాడని పురాణాలు చెప్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu