రైల్వే బడ్జెట్ 2013 : 17 యేళ్ళ తర్వాత కాంగ్రెస్ మంత్రి రైల్వే బడ్జెట్
, మంగళవారం, 26 ఫిబ్రవరి 2013 (12:32 IST)
2013-14
ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే బడ్జెట్ను కేంద్ర రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక రైల్వే మంత్రి 17 యేళ్ల తర్వాత రైల్వే బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అలాగే, రైల్వే శాఖకు చెందిన ఇద్దరు సహాయ మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. చండీగఢ్కు చెందిన పవన్ కుమార్ బన్సల్ యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర జలవనరుల శాఖామంత్రిత్వ శాఖ నుంచి రైల్వే శాఖకు మార్చారు. గత నాలుగు నెలల క్రితం కేంద్ర రైల్వే శాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. తొలిసారి రైల్వే వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో దాఖలు చేస్తున్నారు.