Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

Advertiesment
Ekadasi

సెల్వి

, శుక్రవారం, 14 నవంబరు 2025 (20:03 IST)
ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీహరిని పూజించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. శ్రీహరిని ఈ రోజున పూజించడం చేయడం వల్ల  అన్ని పాపాలు నశించిపోతాయని, మోక్షం లభిస్తుందని విశ్వాసం. ఈ ఉపవాసం జీవితం లో సానుకూలత, సంయమనం, మానసిక శాంతిని తీసుకొస్తుంది. 
 
జీవితంలో కష్టాలను ఎదుర్కొంటున్న భక్తులు ఈ ఏకాదశి ఉపవాసం వుండటం ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. కార్తిక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిగా జరుపుకుంటారు. 
 
వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం ఒక్క కార్తిక ఏకాదశి వ్రతంతో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుందని తెలుస్తోంది. ఉత్పన్న ఏకాదశి రోజు చేసే అన్నదానం విశేషమైన ఫలాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. ఈ రోజు బ్రాహ్మణులకు గోదానం చేయడం ద్వారా నరక బాధల నుంచి విముక్తి పొందవచ్చు.
 
ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆరాధించడానికి తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. ఆ తర్వాత ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేయండి. తర్వాత ఒక పీటంపై విష్ణుమూర్తి విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్టించండి. 
 
తరువాత విష్ణువు మూర్తికి పసుపు పూలు, పండ్లు, ధూపం, దీపం, నైవేద్యం, అక్షతలు, చందనం, తులసి దళాలు సమర్పించండి. ఆ తరువాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో తయారు చేసిన పంచామృతాన్ని శ్రీ మహా విష్ణువుకు సమర్పించండి. 
 
విష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం. అందుకే ఖచ్చితంగా పంచామృతంలో తులసి దళాలను కలపండి. ఆ తర్వాత ఉత్పన్న ఏకాదశి శీఘ్ర కథను పఠించండి. చివర్లో హారతి ఇచ్చి విష్ణువుకి ఇష్టమైన ఆహార పదార్ధాలను నైవేద్యంగా సమర్పించి.. తిరిగి అందరికీ పంచాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అన్నప్రసాదం కోసం నాణ్యమైన బియ్యం మాత్రమే సరఫరా చేయాలి.. వెంకయ్య