Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమరావతి భూమిపూజ.. వరుణుడి ఆశీస్సులు.. శుభసూచకమేనట..!

అమరావతి భూమిపూజ.. వరుణుడి ఆశీస్సులు.. శుభసూచకమేనట..!
, శనివారం, 6 జూన్ 2015 (17:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి భూమిపూజ ప్రాంతాన్ని చిరుజల్లులు పలకరించాయి. మందడం పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి చిరు జల్లులు కురిశాయి. శాస్త్రోక్తంగా పూజలు జరుగుతున్న శుభవేళ వరుణుడు పలకరిస్తే అంతా శుభమే జరుగుతుందని పండితులు అంటున్నారు. భూమిపూజ జరుగుతున్న ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఆవరించి వున్నాయి.
 
భారీ వర్షం పడ్డా భూమిపూజకు అంతరాయం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. బలమైన ఇనుప స్తంభాలపై రేకులను, దాని కింద టెంటును అమర్చారు. అయితే, బలమైన గాలులు కూడా వీస్తుండడంతో అధికారులు కొంత ఆందోళన చెందారు. ఈ పూజలను తిలకించేందుకు సమీప గ్రామాల నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివస్తుండడంతో ఈ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. 
 
అయితే అమరావతి భూమి పూజ సందర్భంగా వర్షం కురవడం.. వరుణ భగవానుడి ఆశీస్సులు లభించినట్లేనని పండితులు అంటున్నారు. ఇంకా రాష్ట్రానికి శుభసంకేతమని పండితులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu