Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పటికబెల్లం లింగార్చనతో వ్యాధులను దూరం చేసుకోవచ్చు.!

పటికబెల్లం లింగార్చనతో వ్యాధులను దూరం చేసుకోవచ్చు.!
, శనివారం, 11 అక్టోబరు 2014 (18:22 IST)
పూర్వజన్మల పాపఫలమే వ్యాధుల రూపంలో పీడిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇవే సుఖసంతోషాలను కూడా నిర్ణయిస్తాయని వారు చెబుతున్నారు. అలాంటి వ్యాధుల బారి నుంచి బయటపడాలంటే, పాపాలకు పరిహారం చేసుకోవాలి. 
 
పుణ్యరాశిని పెంచుకుంటూ పోవడం వలన, పాపఫలితాల నుంచి లభించే ఉపశమనం కూడా పెరుగుతూ వుంటుంది. అలాంటి పుణ్యరాశిని పెంచుకోవడానికిగాను భగవంతుడిని అనునిత్యం సేవిస్తూ వుండాలి.
 
ఇందులో ముఖ్యంగా శివలింగార్చన అత్యున్నతమైన ఫలితాలనిస్తుంది. ఒక్కోరకం శివలింగాన్ని అర్చించడం వలన ఒక్కో విశేష ఫలితం వుంటుంది.
 
కాబట్టి వ్యాధులను దూరం చేసుకోవాలంటే 'పటికబెల్లం'తో చేసిన శివలింగాన్ని అర్చించాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. పటికబెల్లంతో చేసిన శివలింగాన్ని పూజించడం వలన పాపాలు, దోషాలు నశించి వ్యాధులు నివారించబడతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu