Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

22న కామిక ఏకాదశి: విష్ణువును పూజించి.. వెన్నను దానం చేస్తే..?

22న కామిక ఏకాదశి: విష్ణువును పూజించి.. వెన్నను దానం చేస్తే..?
, శుక్రవారం, 18 జులై 2014 (19:25 IST)
ఆషాఢ శుద్ధ ఏకాదశినే మహా ఏకాదశి అని అంటారు. దీన్నీ ప్రథమైకాదాశినాడు అని కూడా అంటుంటారు. ఆషాఢ శుద్ధ ద్వాదశినాడు చాతుర్మాస్యం ప్రారంభిస్తారు. యతులకు, సన్యాసులకు ఇది ఎంతో పవిత్రమైనది ముఖ్యమైంది. కామిక ఏకాదశి అని పిలువబడే రోజున ఆచరించే వ్రతాన్ని పాటిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ఈ దినం ఏకాదశీ వ్రతం, ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతము (వెన్న)ను దానం చేయడం మంచిది.  
 
కామిక ఏకాదశి రోజున తులసీ దళాలతో విష్ణుమూర్తిని పూజించడం ద్వారా సకల సంతోషాలు చేకూరుతాయి. తులసీ దళాలతో పూజ చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. శత్రుబాధ, ఈతిబాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఒక తులసీ దళం.. నవరత్నాలు, వజ్ర వైఢూర్యాలు, స్వర్ణం, వెండి కంటే అతీతమైందని పురాణాలు చెబుతున్నాయి. 
 
అందుచేత కామిక ఏకాదశిన సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి విష్ణుపూజ, తులసీ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు. ఆ రోజున శ్రీ కృష్ణుడిని నిష్ఠగా పూజించి నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపమెలిగిస్తే.. ఆ పరమాత్మ ఆశించిన ఫలితాలనిస్తాడని, పాపాలను హరింపజేసి, స్వర్గలోకవాస ప్రాప్తం ప్రసాదిస్తాడని పురోహితులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu