Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అక్షయ తృతీయనాడు పెరుగన్నం దానం చేస్తే..!?

అక్షయ తృతీయనాడు పెరుగన్నం దానం చేస్తే..!?
FILE
శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోంది. ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించడం సంప్రదాయం. అలాంటి మహిమాన్వితమైన అక్షయ తృతీయనాడు పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.

ఇంకా అక్షయ తృతీయ నాడు నరసింహ స్వామికి పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం.

బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. అలాగే అక్షయ తృతీయ నాడు గోధుమలు, శెనగలు, గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం.

Share this Story:

Follow Webdunia telugu