Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వరాజ్ పాల్ సతీమణికి ఒక కన్ను దూరం..!!

స్వరాజ్ పాల్ సతీమణికి ఒక కన్ను దూరం..!!
FILE
ప్రముఖ ప్రవాస భారతీయ వ్యాపారవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ సతీమణి, అరుణా పాల్ ఒక కన్నును శాశ్వతంగా కోల్పోయారు. తన నివాసానికి దగ్గర్లో నడుస్తూ కింద పడిపోయిన అరుణ కంటికి తీవ్రంగా గాయమైంది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించగా, కన్నును పూర్తిగా తీసివేయాల్సిన పరిస్థితి ఎదురవటంతో దానిని తొలగించారు.

ఈ విషయమై అరుణ భర్త స్వరాజ్ పాల్ మాట్లాడుతూ.. ఇంటికి దగ్గర్లో నడుస్తూ జారి పడిపోయిన అరుణ కంటికి తీవ్రంగా గాయమైందనీ, అయితే ఆమె కన్నును రక్షించేందుకు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించామన్నారు. అయితే తమ ప్రయత్నాలేవీ ఫలించక పోవటంతో ఆమె కన్నును పూర్తిగా తొలగించేందుకు ఒప్పుకోక తప్పలేదన్నారు.

కాగా.. 74 సంవత్సరాల అరుణా పాల్ ఓ వైద్యుడి అపాయింట్‌మెంట్ కోసం నడచి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే లండన్ యూనివర్సిటీ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వెస్ట్రన్ ఐ ఆసుపత్రికి తరలించి, తీవ్ర రక్తస్రావంతో అల్లాడుతున్న అరుణ కంటికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆమె స్వగృహంలో కోలుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu