Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లండన్‌లో ప్రవాసాంధ్రుడి దుర్మరణం

లండన్‌లో ప్రవాసాంధ్రుడి దుర్మరణం
లండన్ నగరంలో నివసిస్తోన్న ప్రవాసాంధ్రుడు అరవింద్ (28) ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యారు. సికింద్రాబాద్‌కు చెందిన అరవింద్ లండన్‌లోని టెక్సో సూపర్ మార్కెట్‌లో ట్రైనీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

గత ఎనిమిది సంవత్సరాలుగా లండన్‌లో ఉంటోన్న అరవింద్... విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. అతను ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కాగా.. అరవింద్ మరణవార్త విన్న ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu