Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మలేషియాలో భారతీయ విద్యార్థి మృతి

మలేషియాలో భారతీయ విద్యార్థి మృతి
మలేషియాలోని పెరాక్ రాష్ట్రంలో వంతెన కూలిన దుర్ఘటనలో కాంపర్ నదిలో పడి ప్రవాస భారతీయ విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గల్లంతయిన ఈ దుర్ఘటన ఉత్తర పెరాక్‌లోని పిక్చర్‌స్క్వేర్ ప్రాంతంలో జరిగింది. కాగా.. కాంపర్ నదిపై కొత్తగా నిర్మించిన ఊయల వంతనె కూలిపోవటంతో ఈ ప్రమాదం సంభవించింది.

ఈ విషయమై స్థానిక పోలీసులు మాట్లాడుతూ... విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులు గుంపుగా వంతెనపైకి చేరటంతో అది ఉన్నఫళంగా కూలిపోయిందని చెప్పారు. ప్రమాద సమయంలో వంతెనపై 22 మంది విద్యార్థులున్నట్లు పోలీస్ అధికారి అజీజ్ సాలెహ్ వివరించారు. ఈ ప్రమాదంలో నదిలో పడిపోయిన విద్యార్థుల్లో 19 మందిని స్థానిక ప్రజలు కాపాడారని చెప్పారు.

అయితే.. నదిలో పడిపోయిన భారతీయ విద్యార్థి కే. మాథివనాన్‌ను కాపాడినప్పటికీ, కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడనీ.. మరో ఇద్దరు గల్లంతయ్యారని సాలెహ్ వెల్లడించారు. గల్లంతయిన ఇద్దరు విద్యార్థుల కోసం 300 మంది సహాయ సిబ్బంది గాలింపు జరపుతున్నారనీ చెప్పారు. కాగా.. 50 మీటర్ల పొడవుండే ఈ వంతెనను రెండు వారాల క్రితమే నిర్మించినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu