Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్థులు మృతి

అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్థులు మృతి
అమెరికాలోని సెయింట్ లూయి మిసోరీలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో జరిగిన ధీరజ్, శ్రీకాంత్, శ్రీహర్ష, సృజన్ రెడ్డిగా గుర్తించారు. వీరంతా మిసోరీ రోలా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ విద్యాభ్యాసం చేస్తున్నారు.

ధీరజ్, శ్రీకాంత్ హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, శ్రీహర్ష విశాఖ జిల్లా వాసిగా భావిస్తున్నారు. అలాగే వేముల సృజన్ రెడ్డి కరీంనగర్ జిల్లా వాసిగా తెలిసింది. తీవ్రంగా గాయపడిన బొట్టు మురళిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

Share this Story:

Follow Webdunia telugu