Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌కు ఆస్ట్రేలియా బృందం : వయలార్

భారత్‌కు ఆస్ట్రేలియా బృందం : వయలార్
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై వరుసగా జాత్యహంకార దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రతినిధుల బృందం జూలై నెలలో మన దేశానికి రానుందని ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖా మంత్రి వయలార్ రవి న్యూఢిల్లీలో వెల్లడించారు.

ఈ విషయమై వయలార్ రవి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... 17 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందంలో అక్కడి వర్సిటీల వీసీలతో పాటు ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఎన్జీవోలు ఉంటారని పేర్కొన్నారు. ఈ బృందం మన దేశంలోని వివిధ నగరాలతో పాటు హైదరాబాద్‌ను కూడా సందర్శిస్తుందని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ బృందం ప్రతినిధులు సమావేశమవుతారని వయలార్ రవి తెలిపారు. ఇదిలా ఉంటే... దాడుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించిన తెలుగుదేశం నేత నామా నాగేశ్వరరావు ఈ సందర్భంగా వయలార్ రవికి ఓ వినతిపత్రం సమర్పించారు.

Share this Story:

Follow Webdunia telugu