Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lalita Panchami 2025: లలితా పంచమి రోజున సుమంగళీ పూజ తప్పనిసరి.. కుంకుమ పూజలు చేస్తే?

Advertiesment
Lalitha

సెల్వి

, శుక్రవారం, 26 సెప్టెంబరు 2025 (13:16 IST)
Lalitha
లలితా పంచమి సెప్టెంబర్ 27వ తేదీ, ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజును లలితా పంచమిగా జరుపుకోవాలని పంచాంగ నిపుణులు అంటున్నారు. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదించే ఈ తల్లి అనుగ్రహం పొందాలంటే ఈ రోజు సువాసిని పూజ చేయాలి. 
 
దసరా నవరాత్రుల్లో లలితా పంచమి రోజు ఈ పూజ చేస్తారు. సువాసిని పూజ చేసే వారు సూర్యోదయంతో నిద్రలేచి ఇల్లు వాకిళ్లు శుభ్రం చేసుకుని ఇంటిని, పూజామందిరాన్ని చక్కగా అలంకరించుకోవాలి. పూజామందిరంలో లలితాదేవిని ప్రతిష్టించుకోవాలి. ఇంటికి ముత్తైదువులను ఆహ్వానించాలి. 
 
ఇంటికి వచ్చిన సుహాసినులకు ముందుగా పాదాలకు పసుపు పూసి, పారాణి పెట్టాలి. సుహాసిని పూజ చేసుకునే వారు ఇంటికి వచ్చిన ముత్తైదువులతో కలిసి సామూహిక లలితా సహస్రనామ పారాయణ చేయాలి. 
 
ఈ రోజు లలితా పంచమి కాబట్టి మూడు లేదా అయిదు సార్లు లలితా సహస్రనామ పారాయణ చేయడం ఎంతో మంచిది. అనంతరం అమ్మవారికి చక్రపొంగలి, కదంబ ప్రసాదం, పులిహోర, బూరెలు, కొబ్బరికాయ, అరటిపండ్లు వంటి నైవేద్యాలు సమర్పించాలి. ముత్తైదువులకు భోజనం పెట్టాలి. ఆపై వాయనం ఇవ్వాలి. 
 
లలితా పంచమి రోజు సుహాసిని పూజ చేసుకున్న వారు శ్రీ లలితా దేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. కుంకుమ పూజలు చేసిన వారికి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. 
 
ఓం శ్రీ మాత్రేనమః అని వీలైనన్ని సార్లు జపించుకుంటే ఆ చల్లని తల్లి కరుణాకటాక్షాలు తన భక్తులపై ప్రసరింపజేస్తుంది. లలితా దేవిని ఈ విధంగా పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Gold man: ఆరు కిలోల బంగారు ఆభరణాలతో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మెరిసిన గోల్డ్ మ్యాన్