Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆప్ నుంచి ప్రశాంత్ భూషణ్.. యోగేంద్ర యాదవ్ బహిష్కరణ!

ఆప్ నుంచి ప్రశాంత్ భూషణ్.. యోగేంద్ర యాదవ్ బహిష్కరణ!
, శనివారం, 28 మార్చి 2015 (14:08 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్‌లు బహిష్కరించారు. ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసినందుకు గాను వారిని పార్టీ నుంచి, పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి బహిష్కరించారు. ఈ మేరకు ఇదే సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
 
అనంతరం పార్టీలో అసమ్మతికి ఆజ్యం పోసి, క్రమశిక్షణ ఉల్లంఘించిన వీరిద్దరినీ పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ నేతలు గూండాల్లా వ్యవహరించారని ఆరోపించారు. పార్టీలో సంస్కరణలు కోరుతున్న వారిపై పిడిగుద్దులు కురిపించారని వారు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu