Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీజేపీలో 75 ఏళ్లు పైబడిన వారంతా.. బ్రెయిన్ డెడ్..?: యశ్వంత్ సిన్హా

బీజేపీలో 75 ఏళ్లు పైబడిన వారంతా.. బ్రెయిన్ డెడ్..?: యశ్వంత్ సిన్హా
, బుధవారం, 24 జూన్ 2015 (18:35 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా.. అదే పార్టీ, ప్రధాని నరేంద్ర మోడీ విధానాలపై మండిపడ్డారు. బీజేపీలో 70 ఏళ్లు దాటిన నేతలందరినీ మంత్రులుగా తీసుకోకూడదని మోడీ పెట్టిన నిబంధనపై సిన్హా ఫైర్ అయ్యారు.

ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన మే 26, 2014న బీజేపీలో 75 ఏళ్లు పైబడిన వారంతా బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. అలా బ్రెయిన్ డెడ్ అయిన వారిలో తాను కూడా ఉన్నానని యశ్వంత్ సిన్హా తెలిపారు. 
 
అలాగే మోడీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంపై కూడా సిన్హా విమర్శలు చేశారు. బీజేపీ అగ్రనేతలను నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుబట్టారు. కాగా మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్.. చంద్రశేఖర్ ప్రభుత్వాల్లో ఆర్థిక, విదేశాంగ వ్యవహారాల శాఖలను యశ్వంత్ నిర్వహించారు. కాగా ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వంలో యశ్వంత్ కుమారుడు జయంత్ సిన్హా ఆర్థిక శాఖ సహాయమంత్రిగా ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu