డబ్బు కోసం మహిళల శరీరాలను ఎందుకు అమ్ముకుంటారు?: కేంద్రమంత్రి అనుప్రియ
వివాదాస్పద సరోగసీ బిల్లుపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తనదైనశైలిలో స్పందించారు. మహిళలకు మేలు చేకూర్చే అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంటే వాటివల్ల లబ్దిని పొందకుండా
వివాదాస్పద సరోగసీ బిల్లుపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ తనదైనశైలిలో స్పందించారు. మహిళలకు మేలు చేకూర్చే అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంటే వాటివల్ల లబ్దిని పొందకుండా డబ్బుకోసం శరీరాలను ఎందుకు అమ్ముకుంటారని ఆమె ప్రశ్నించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం సరోగసీ బిల్లును ప్రవేశపెట్టింది.
దీనిపై ఆమె స్పందిస్తూ.. "సులభంగా డబ్బు సంపాదించేందుకు మహిళలను వాడుకుంటున్నారు. ఏం కుటుంబాలివి?" అని ఆమె ప్రశ్నించారు. భారతదేశంలో ఎంత మంది మహిళలు తమకు ఇష్టపూర్వకంగానే గర్భాన్ని అద్దెకు ఇస్తున్నారని కూడా ఆమె అడిగారు. ఇల్లు గడవడం కోసం అద్దె గర్భాన్ని మోయడం శరీరాన్ని అమ్ముకోవడమేనని, దీన్ని నివారించాల్సిందేనని అన్నారు.