Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యూఢిల్లీ క్రైమ్ : మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై మోజు పడిందని అక్కను చంపేసిన చెల్లెలు

దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం జరిగింది. తోడబుట్టిన అక్కను ఓ చెల్లెలు హతమార్చింది. కారణం ఎంటో తెలుసా.. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై అక్క మోజు పడటమే దీనికి కారణం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పర

న్యూఢిల్లీ క్రైమ్ : మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై మోజు పడిందని అక్కను చంపేసిన చెల్లెలు
, మంగళవారం, 20 డిశెంబరు 2016 (10:13 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో మరో దారుణం జరిగింది. తోడబుట్టిన అక్కను ఓ చెల్లెలు హతమార్చింది. కారణం ఎంటో తెలుసా.. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌పై అక్క మోజు పడటమే దీనికి కారణం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్కు సమీపంలో అక్కాచెల్లెలు నివాసముంటున్నారు. తాను వద్దని వారించినా అక్క తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ వసీమ్‌పై ఆసక్తి చూపిస్తుందనే ఆగ్రహంతో చెల్లెలు కంట్రీమేడ్ పిస్టల్‌తో కాల్చి చంపింది. ఆపై పోలీసులను తప్పుదారి పట్టిస్తూ తన అక్కను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారని చెప్పింది. 
 
చెల్లెలి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు ఆమెను ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగుచూసింది. కొత్త బాయ్‌ఫ్రెండ్‌ ఇచ్చిన కంట్రీ మేడ్ పిస్టల్‌తో కాల్చి చంపిన చెల్లెలు దాన్ని తిరిగి ఆయనకే ఇచ్చిందని ఢిల్లీ డీసీపీ అజిత్ కుమార్ సింగ్లా చెప్పారు. అక్కను హతమార్చిన చెల్లెలిని అరెస్టు చేసి రిమాండుకు తరలించామని డీసీపీ వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ టోన్‌లో వచ్చిన మార్పేంటి? పెద్ద నోట్ల రద్దుపై కేసీఆర్ పాజిటివ్‌గా మాట్లాడారే?