Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శోభనం రాత్రి ముగియకముందే భర్తను చంపి నగలతో ఉడాయించిన భార్య!

శోభనం రాత్రి ముగియకముందే భర్తను చంపి నగలతో ఉడాయించిన భార్య!
, శుక్రవారం, 27 మే 2016 (09:49 IST)
పెళ్లి చేసుకుని 24 గంటలైనా గడవకముందే.. నూతన వరుడిని హత్య చేసి.. డబ్బు, నగలతో ఉడాయించిందో నవ వధువు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వివరాల్లోకి వెళితే.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నిర్మల్‌ సింగ్‌ మొదటి భార్య చనిపోయింది. అతడికి దివ్యాంగ్‌ అనే కుమారుడు ఉన్నాడు. 
 
ఇటీవల తార అనే మహిళతో సింగ్‌కు పరిచయం ఏర్పడటంతో ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే అదే రాత్రి సింగ్‌, ఆయన కుమారుడికి తార మత్తుమందు ఇచ్చింది. అనంతరం సింగ్‌ను హత్య చేసిడబ్బు, నగలతో పరారైంది. 
 
స్పృహలోకి వచ్చిన దివ్యాంగ్‌ ఘటన గురించి స్థానికులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే హత్య చేసిన అనంతరం తార దివ్యాంగ్‌ మొబైల్‌ఫోన్‌ తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితురాలి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యేడాదిన్నర బిడ్డను చితకబాదిన సంరక్షకుడు... కేసు నమోదు చేయని యుఎస్ పోలీసులు.. ఎందుకంటే?