Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యతో మద్యం తాగించి.. స్నేహితులతో గడపమని భర్త ఒత్తిడి

భార్యతో మద్యం తాగించి.. స్నేహితులతో గడపమని భర్త ఒత్తిడి
, శనివారం, 27 ఆగస్టు 2016 (14:15 IST)
అగ్నిసాక్షిగా మనువాడిన భార్యకు పూటుగా మద్యం తాగించి తన స్నేహితులకు పడకసుఖం ఇవ్వాలని ఓ భర్త ఒత్తిడి చేశాడు. అంతేనా... అతని ఒత్తిడికి ఆ భార్య లొంగకపోవడంతో సిగరెట్‌ పీకలతో కాల్చి చిత్రహింసలు కూడా పెట్టాడు. మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
పుణె జిల్లా హదాప్సర్కు చెందిన 40 యేళ్ళ మహిళ పోలీసులకు ఓ ఫిర్యాదు ఇచ్చింది. ఇందులో భర్త ఆమె పట్ల బలవంతంగా మద్యం తాగించి, ఆ తర్వాత తన స్నేహితులతో గడపాల్సిందిగా బలవంతం చేస్తున్నట్టు పేర్కొంది. అంతేకాకుండా, అతని డిమాండ్లకు ఒప్పుకోకపోతే భార్యను సిగరెట్ పీకలతో కాల్చి చిత్రహింసలు పెడుతున్నట్టు తెలిపింది. 
 
పైగా, కుటుంబ సభ్యులు సైతం భర్త చర్యలు మందలించకుండా వంతపాడుతూ... తననే దూషిస్తూ వేధిస్తున్నట్టు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వేధింపులు భరించలేక చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చినట్టు వనోవ్రీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుమేరకు భర్త, అతని తల్లి, తమ్ముడు, సోదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిందితులను ఇంకా అరెస్టు చేయాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిలయన్స్ నుంచి బంపర్ ఆఫర్: శాంసంగ్ జే సిరీస్ కొనేవాళ్లకు 1జీబీ డేటా