Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందరి సమ్మతితోనే.. గోవధ నిషేధం : రాజ్ నాథ్

అందరి సమ్మతితోనే.. గోవధ నిషేధం : రాజ్ నాథ్
, సోమవారం, 30 మార్చి 2015 (08:24 IST)
దేశంలో అన్ని పార్టీల సమ్మతితో గోవధ నిషేధాన్ని అమలులోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇండోర్ లో ఆయన ఆదివారం జరిగిన జైనమత కార్యక్రమంలో  ఆయన మాట్లాడారు. గోవధ అనేది బీజేపీ సిద్ధాంతాలకు ఎప్పుడూ వ్యతిరేకమేనన్నారు. 
 
అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదివరకే గోవధను నిషేధించిన విషయాన్ని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. జైనమతం అహింసను పాటిస్తుందని, అది దేశ సంస్కృతిపై ఎంతో ప్రభావం చూపిందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu