ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ రియాలిటీ షో బిగ్బాస్లో నటించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెల్సిందే.
నిజానికి ఓ కవి నుంచి రాజకీయనేతగా మారిన విశ్వాస్ 'బిగ్ బాస్-8' రియాలిటీ షోలో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ మేరకు సదరు ప్రొడక్షన్ సంస్థ ఎండోమోల్ షోలో కంటెస్టెంట్గా పాల్గొనాలంటూ సంప్రదించిందంటూ ఇందుకుగానూ రూ.5 కోట్లు ఆఫర్ చేసినట్లు వినికిడి.
ఈ విషయాన్ని ఆప్ నేత కూడా ఖరారు చేశారు. సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు. మిగతా వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.