Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నరేంద్ర మోడీకి లెక్క తెలియదా? అమిత్ షా ఎందుకలా అన్నారు?

నరేంద్ర మోడీకి లెక్క తెలియదా? అమిత్ షా ఎందుకలా అన్నారు?
, శనివారం, 3 అక్టోబరు 2015 (16:12 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంతవరకు 3,770 కోట్ల రూపాయల బ్లాక్ మనీ వసూలు చేశామన్నారు. దీంతో మీడియాకు అసలు వసూలైన నల్లధనం ఎంతో అనే దానిపై అనుమానం వచ్చింది. పందాగ్రస్టు వేడుకల సందర్భంగా మోడీ ఎర్రకోటపై ప్రసంగిస్తూ.. రూ.6,500 కోట్ల రూపాయల నల్లధనం వసూలు చేశామని చెప్పారే..? అదేంటి మోడీ అలా చెప్పారు? మీరిలా అంటున్నారని అడిగేశారు. 
 
మీడియా ప్రశ్నకు అరుణ్ జైట్లీ మౌనం వహించినా.. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రం ప్రధానికి లెక్క తెలియదని.. ఏదో ఎమోషనల్‌గా ఒక అంకెను చెప్పేశారని పేర్కొన్నారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ తప్పులు లెక్కలు చెప్తున్నారని బీజేపీ అగ్రనేతలే చెప్పడంపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. దేశ ప్రధాన మంత్రి అంతటి వ్యక్తి అవగాహన లేకుండా మాట్లాడటం ఏంటనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. 
 
దీంతో మోడీ అబద్ధం చెప్పారా? విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొస్తామని.. ప్రతి భారతీయుడి అకౌంట్లో లక్షల చొప్పున జమచేస్తామని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చెప్పిన మాటలన్నీ ఏమౌతాయోనని మీడియా అంటోంది. అంతేగాకుండా నల్లధనంపై మోడీ వేసిన కమిటీ కూడా ఎలా పనిచేస్తుందోనని మీడియా అనుమానం వ్యక్తం చేస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu