Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీలో 19 ఏళ్ల కార్మికుడిని చంపిన తెల్లపులి... 15 నిమిషాలు అతడినలా చూసిన తర్వాతే...

ఢిల్లీలో 19 ఏళ్ల కార్మికుడిని చంపిన తెల్లపులి... 15 నిమిషాలు అతడినలా చూసిన తర్వాతే...
, మంగళవారం, 23 సెప్టెంబరు 2014 (22:20 IST)
ఢిల్లీలోని జూలో మంగళవారం 19 ఏళ్ల కార్మికుడిని చంపిని తెల్లపులి ప్రతిరోజూ 10 కేజీల మాంసం తింటుందని జూ అధికారులు తెలిపారు. విజయ్ అనే పేరుతో పిలుచుకునే ఈ తెల్లపులికి ప్రతిరోజూ తాము 10 కిలోల బర్రె మాంసం వేస్తామని అతడు తెలిపాడు. కాగా ఢిల్లీలోని జంతు ప్రదర్శనశాలలో మంగళవారం తెల్ల పులిని ఉంచిన ఎన్‌క్లోజర్‌లో మతి స్థిమితం లేనట్లుగా చెపుతున్న 19 ఏళ్ల వ్యక్తి పులిని ఉంచిన ఎన్‌క్లోజర్ పైకి ఎక్కి లోపలికి దూకడంతో ప్రమాదం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. 
 
తొలుత అతడు పులి ఉన్న ఎన్ క్లోజర్ లోకి పడిపోవడంతో తెల్లపులి అతడి వద్దకు వచ్చి అలా 15 నిమిషాల పాటు చూస్తూ ఉంది. ఆ సమయంలో లోపల పడిపోయిన వ్యక్తి ప్రాణ భయంతో పులి వైపు చేతులో జోడిస్తూ తనను వదిలేయమంటూ వేడుకున్నాడు. ఐతే పులి మాత్రం అతడినే చూస్తూ ఉంది. అతడికి హాని తలపెడుతుందేమోనని అక్కడ ఉన్న కొందరు పులిపైకి రాళ్లు విసిరినా అది పట్టించుకోలేదు. 
 
కొద్దిసేపటి తర్వాత అతడిని పంజాతో కొట్టి అతడి మెడను నోట కరచుకుని దాదాపు 20 మీటర్ల మేర ఈడ్చుకుని వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతడు 10 నిమిషాల పాటు ప్రాణాలతో కొట్టుకున్నట్లు చెపుతున్నారు. ఇది జరిగినపుడు పులి ఎన్‌క్లోజర్ సమీపంలో భద్రతా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో అతడిని కాపాడలేకపోయారు.

Share this Story:

Follow Webdunia telugu