Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లిబియాలో అపహరణకు గురైన భారతీయులను రక్షించేందుకు చర్యలు: వెంకయ్య

లిబియాలో అపహరణకు గురైన భారతీయులను రక్షించేందుకు చర్యలు: వెంకయ్య
, శుక్రవారం, 31 జులై 2015 (13:58 IST)
లిబియాలో అధ్యాపకులుగా పని చేస్తూ ట్రిపోలి వద్ద అపహరణకు గురైన నలుగురు భారతీయులను సురక్షితంగా రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని  మంత్రి వెంకయ్యనాయుడు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పారు.  
 
శుక్రవారం పార్లమెంట్‌ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అపహరణకు గురైన వారిలో ఇద్దరు తెలుగువారు కూడా ఉన్నారని, దీనిపై ఉదయమే కేంద్ర విదేశాంగశాఖమంత్రితో చర్చించినట్లు వెల్లడించారు. బాధితులను కాపాడేందుకు విదేశాంగశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తుందని వివరించారు. వారు సురక్షితంగా ఇండియా చేరుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu