Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్‌ను పొగిడితే చెప్పుతో కొట్టాలి... సాధ్వి సంచలన వ్యాఖ్య..!

పాక్‌ను పొగిడితే చెప్పుతో కొట్టాలి... సాధ్వి సంచలన వ్యాఖ్య..!
, గురువారం, 5 మార్చి 2015 (10:22 IST)
భారతదేశంలో నివశిస్తూ పాకిస్థాన్‌ని పొగిడేవాళ్ళను చెప్పుతో కొట్టాలి అంటూ వీహెచ్‌పీ నాయకురాలు బాలికా సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కి అనుకూలంగా మాట్లాడేవారిని పాకిస్థాన్‌కే తరిమి కొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. మంగళూరులో జరిగిన హిందూ సమాజోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ప్రసంగిస్తూ పాక్‌ను పొగిడేవారిని ఆ దేశానికే తరిమి తరిమి కొట్టాలన్నారు. 
 
భారత్‌లో ఉంటూ, ఇక్కడ పండుతున్న తిండి తింటూ పరాయి దేశాన్ని పొగిడేవాళ్లను కొట్టి తరమాలని ఉద్బోధించారు. ఇటువంటి వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించరాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో శ్రీరాముడికి గుడి కట్టాలని, ఇస్లామాబాదులో కూడా రామమందిరం నిర్మించి అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు. మనమంతా ఆయుధాలు పట్టుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu