Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూరత్‌లో 500 మందిని హిందూమతంలోకి మార్చాం : వీహెచ్‌పీ

సూరత్‌లో 500 మందిని హిందూమతంలోకి మార్చాం : వీహెచ్‌పీ
, ఆదివారం, 21 డిశెంబరు 2014 (12:47 IST)
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో 500 మంది గిరిజనులను హిందూ మతంలోకి మార్చినట్టు విశ్వ హిందూ పరిషత్ వెల్లడించింది. వీరంతా నిరుపేద క్రైస్తవులుగా కొనసాగుతూ వచ్చారని ప్రకటించింది. 
 
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు సమీపంలోని వల్సాద్‌లో శనివారం చేపట్టిన ‘ఘర్ వాపసీ’ కార్యక్రమంలో భాగంగా గిరిజనులను హిందూ మతంలోకి తీసుకొచ్చామని ఆ సంస్థ ప్రకటించింది. 
 
ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి తాము ఎలాంటి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని ప్రకటించిన ఆ సంస్థ, చట్టాన్ని మాత్రం ఉల్లంఘించలేదని పేర్కొంది. మత మార్పిడిలో గిరిజనులను తాము బలవంతపెట్టలేదని వల్సాద్ వీహెచ్ పీ కార్యదర్శి అజిత్ సోలంకి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu