Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖురేషిని రాజీనామా చేయమని కోరలేదు: రాజ్ నాథ్ సింగ్

ఖురేషిని రాజీనామా చేయమని కోరలేదు: రాజ్ నాథ్ సింగ్
, శనివారం, 23 ఆగస్టు 2014 (14:30 IST)
ఉత్తరాఖండ్ గవర్నర్ అజీజ్ ఖురేషీ రాజీనామా విషయంపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఖురేషిని తాము రాజీనామా చేయమని కోరలేదని ఆయన స్పష్టం చేశారు. 
 
రాష్ట్రపతి ఆదేశాల మేరకు నియమితుడినైన తనను రాజీనామా చేయాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎలా ఆదేశిస్తారని ప్రశ్నంచిన ఖురేషీ, కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రంతో పాటు హోం మంత్రిత్వ శాఖకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 
 
సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ‘రాజ్ భవన్‌ను ఖాళీ చేయాలని ఖురేషీని మేం కోరలేదు. దీనిపై కోర్టుకు తగిన రీతిలో సమాధానం చెబుతాం’’ అన్నారు. 
 
యూపీఏ హయాంలో నియమితులైన పలు రాష్ట్రాల గవర్నర్లు బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu